vijay devarakonda: 'గీత గోవిందం' .. 59 సెంటర్లలో 50 రోజులు

  • ఆగస్టు 15న వచ్చిన 'గీత గోవిందం'
  • 6 కోట్ల బడ్జెట్ .. 125 కోట్ల వసూళ్లు 
  • విజయ్ దేవరకొండకి స్టార్ డమ్

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా 'గీత గోవిందం' తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోయింది.

నిన్నటితో ఈ సినిమా 59 సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకుంది. కేవలం 6 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ సినిమా, ఇంతవరకూ 125 కోట్లను రాబట్టడం విశేషం. 'గీత గోవిందం' తరువాత కొన్ని సినిమాలు వచ్చినా, అవి ఈ సినిమా వసూళ్లను ప్రభావితం చేయలేకపోయాయి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి స్టార్ డమ్ వచ్చేసింది. మొత్తానికి ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.

More Telugu News