maniratnam: ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీసును పేల్చి వేస్తామంటూ బెదిరింపులు!

  • 'నవాబ్' సినిమాలో డైలాగ్ ను తొలగించాలని డిమాండ్
  • ఆఫీసు వద్ద భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు
  • మంచి కలెక్షన్లను రాబడుతున్న 'నవాబ్'

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం కార్యాలయాన్ని బాంబులతో పేల్చి వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, మణిరత్నం తెరకెక్కించిన 'నవాబ్' చిత్రం ఇటీవలే విడుదలై, తమిళనాట విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ నేపథ్యంలో, సినిమాలో ఒక అభ్యంతరకర డైలాగ్ ను తొలగించాలని చెన్నైలోని అభిరామపురంలో ఉన్న మణిరత్నం కార్యాలయానికి ఓ ఆగంతుకుడు ఫోన్ చేశాడు. లేని పక్షంలో ఆఫీసును పేల్చేస్తామని బెదిరించారని అయితే, సినిమాలోని ఏ డైలాగ్ ను తొలగించాలో మాత్రం చెప్పలేదని మణిరత్నం కార్యాలయ సిబ్బంది తెలిపారు.

బెదిరింపులకు సంబంధించి ఫిర్యాదు అందడంతో... మణి కార్యాలయానికి పోలీసులు భద్రతను కల్పించారు. సెప్టెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్క తమిళనాడులోనే ఇప్పటికే రూ. 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

More Telugu News