Trisha: 'శబరిమలకు మహిళల ప్రవేశం'పై నటి త్రిష స్పందన!

  • శబరిమలకు ఏ వయసు మహిళలైనా వెళ్లవచ్చని సుప్రీం తీర్పు
  • స్త్రీలకు దక్కిన గౌరవమన్న త్రిష
  • గతంలో సహజీవనం తప్పుకాదని విమర్శల పాలైన త్రిష

అయ్యప్ప స్వామి అందరివాడేనని, ఏ వయసు మహిళలైనా నిరభ్యంతరంగా వెళ్లవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దక్షిణాది నటి త్రిష స్పందించింది. ఈ తీర్పుపై మిశ్రమ స్పందన వస్తున్న వేళ, వివాదాస్పద అంశాల్లో ముందుండే త్రిష, తన అభిప్రాయాన్ని చెబుతూ, కోర్టు ఆదేశాలు స్త్రీలకు దక్కిన గౌరవమని చెప్పింది.

తాను నటించిన '96' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉన్న త్రిష, ఈ వ్యవహారాల గురించి తనకు పూర్తిగా తెలియదుగానీ, దేవాలయాలకు వెళ్లే ఎవరినీ అడ్డుకోరాదని తెలిపింది. కాగా, ఇటీవల సుప్రీంకోర్టు సహజీవనం తప్పుకాదని చెబుతూ, గే సెక్స్ పై కీలక తీర్పిచ్చిన వేళ కూడా, త్రిష, ఆ తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.

More Telugu News