devdas: మా విహారయాత్ర మరింత సరదాగా ఉంది: నాగార్జున

  • ప్రస్తుతం ఐబిజా ట్రిప్ లో ఉన్న నాగార్జున కుటుంబం
  • ఓ ఫొటో పోస్ట్ చేసిన నాగార్జున
  • ఆ ఫొటోలో నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత అఖిల్ తదితరులు

అక్కినేని నాగార్జున కుటుంబం ప్రస్తుతం ఐబిజా ట్రిప్ లో ఎంజాయ్ చేస్తోంది. ‘దేవదాస్’ విడుదలకు ముందు రోజే నాగార్జున ఆ ట్రిప్ లో చేరారు. ‘దేవదాస్’ ఇచ్చిన విజయంతో ఈ ట్రిప్ ను మరింతగా ఎంజాయ్ చేస్తున్నానని నాగ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సక్సెస్ దరి చేరడం వల్ల కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి చేస్తున్న విహారయాత్ర మరింత సరదాగా ఉందని చెప్పిన నాగ్, ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో నాగార్జున, భార్య అమల, నాగ చైతన్య-సమంత జంట, అఖిల్ తదితరులు ఉన్నారు. 

  • Loading...

More Telugu News