Petrol: నేడు ఏకంగా 22 పైసలు పెరిగిన పెట్రోలు ధర!

  • లీటరు డీజిల్ పై 18 పైసల వడ్డన
  • న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 83.22కు
  • డీజిల్ ధర రూ. 74.42కు చేరిక

ఇటీవలి కాలంలో నిత్యమూ 6 పైసలు, 7 పైసలు, 8 పైసలుగా పెరుగుతూ వస్తున్న లీటరు పెట్రోలు ధర శుక్రవారం నాడు ఏకంగా 22 పైసలు పెరిగింది. ఇదే సమయంలో డీజిల్ ధర లీటరుకు 18 పైసల మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.22కు, డీజిల్ ధర రూ. 74.42కు పెరిగాయి.

ముంబైలో పెట్రోలు ధర రూ. 90.57, డీజిల్ ధర రూ. 79.01కి చేరాయి. ఈ వారంలో ఒక్క బుధవారం నాడు మాత్రమే ధరల్లో మార్పు లేకపోగా, మిగతా అన్ని రోజులూ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. పెట్రోలు ధర కోల్ కతాలో రూ. 85.02కు, చెన్నైలో రూ. 86.48కి చేరుకోగా, డీజిల్ ధర కోల్ కతాలో రూ. రూ. 76.27, రూ/ 78.60కి పెరిగాయి.

More Telugu News