Pawan Kalyan: పవన్ కల్యాణ్ కంటికి మళ్లీ గాయం!

  • దెందులూరు సభలో పవన్ పై పూల వర్షం
  • కంటికి తగిలిన జెండాలు, టవల్స్
  • ఈ ఉదయం ఆయనకు చికిత్స అందించిన డాక్టర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కంటికి మళ్లీ గాయమైంది. ఇటీవల కొంతకాలం పాటు కంటి సమస్యతో ఆయన బాధ పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఎక్కడకు వెళ్లినా నల్లటి కళ్లజోడు పెట్టుకునే కనిపించారు. ఆ తర్వాత కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నిన్న జరిగిన జనసేన బహిరంగసభకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ పై పూల వర్షం కురిపించడంతో పాటు, ఎర్ర రంగు టవల్స్, పార్టీ జెండాలను ఆయనపైకి విసిరారు. ఈ నేపథ్యంలో కంటికి జెండాలు, టవల్స్ తగలడంతో మళ్లీ గాయమైంది. దీంతో ఈ ఉదయం కంటి డాక్టర్లు వచ్చి ఆయనకు చికిత్స అందించారు.

More Telugu News