ntr: 'అరవింద సమేత'లో తన పోర్షన్ పూర్తిచేసిన పూజా

  • రాయలసీమ నేపథ్యంలో సాగే కథ
  • తీర్చిదిద్దుతోన్న త్రివిక్రమ్ 
  • దసరాకి భారీస్థాయి విడుదల

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించింది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపొందింది. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి పూజా హెగ్డే పోర్షన్ పూర్తయింది. ఈ విషయాన్ని ఆమె స్పెషల్ వీడియో ద్వారా తెలియజేసింది. అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేయమని చెప్పింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి .. పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది . అందువలన ఈ సినిమాతో ఎన్టీఆర్ కి మరో బ్లాక్ బస్టర్ పడినట్టేననే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. 'అజ్ఞాతవాసి' తరువాత తాను చేస్తోన్న సినిమా కావడంతో, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని దర్శకుడు త్రివిక్రమ్ దీనిని తీర్చిదిద్దుతున్నాడు.  

More Telugu News