Narendra Modi: ప్రధాని మోదీ ప్రసంగం.. వేదికపైనే హాయిగా నిద్రపోయిన బీజేపీ ఎంపీ రవీంద్ర!

  • జార్ఖండ్ రాజధాని రాంచీలో ఘటన
  • ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ
  • దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు, ప్రతిపక్షాలు

ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని 50 కోట్ల మంది పేదలకు ఆరోగ్య బీమాను కల్పిస్తూ ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. దీని కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల బీమాను అందజేస్తామని ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఈ బహిరంగ సభలో ప్రధాని ఓవైపు ప్రసంగిస్తుంటే బీజేపీ పార్లమెంటు సభ్యుడు రవీంద్రరాయ్ మాత్రం హాయిగా కునికిపాట్లు తీశారు. పక్కనే ప్రధాని ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి తన పని కానిచ్చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో రవీంద్రరాయ్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో సాక్షాత్తూ ఎంపీనే నిద్రపోతే.. ఇక ఆయన ఈ పథకం గురించి ప్రజలకు ఏం చెబుతారని విపక్షాలు ప్రశ్నించాయి.

More Telugu News