telangana: కూటమిలోని పార్టీల బలాబలాలపై ఫ్లాష్ సర్వే చేపట్టిన కాంగ్రెస్.. రెండు రోజుల్లో సర్వే ఫలితాలు!

  • కూటమిలో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు  
  • తొలి దశ చర్చలు పూర్తి 
  • అనంతరం సీట్ల సర్దుబాటు

టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సీట్ల సర్దుబాటు అంశం ఒక కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. మహాకూటమిలోని కీలక నేతలు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తొలి దశ చర్చలు పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వేను చేపట్టింది. మరో రెండు రోజుల్లో ఈ సర్వే ఫలితాలు రానున్నాయి. సర్వే ఆధారంగా నియోజకవర్గాల వారీగా కూటమిలోని పార్టీల బలాబలాలను కాంగ్రెస్ పార్టీ అంచనా వేయనుంది. అనంతరం సీట్ల సర్దుబాటుపై తుది విడత చర్చలు జరిపి... సీట్ల పంపకాలను ఖరారు చేయనున్నారు.

More Telugu News