amaravati: అమరావతి ముట్టడికి ‘అసైన్డ్’ రైతుల పిలుపు.. హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు!

  • ప్యాకేజీ పెంచాలని డిమాండ్
  • గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల రైతులు ఈరోజు ఆందోళనకు పిలుపునిచ్చారు. పట్టా భూములతో సమానంగా తమకు ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు అసెంబ్లీ చుట్టూ భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా రైతులు అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగకుండా చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మార్గంలోని వాహనాల రాకపోకలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు.. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

More Telugu News