rangasthalam: మరో రికార్డును సొంతం చేసుకున్న 'రంగమ్మా.. మంగమ్మా..' పాట!

  • గోదావరి యాసతో విశేషంగా ఆకట్టుకున్న 'రంగమ్మా.. మంగమ్మా..' సాంగ్
  • సోషల్ మీడియాలో 10 కోట్ల వ్యూస్ ను క్రాస్ చేసిన పాట
  • 1985 నాటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన 'రంగస్థలం'

రామ్ చరణ్, సమంతల కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది.

గోదావరి యాసతో 'రంగమ్మా, మంగమ్మా... ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మ... పట్టించుకోడు' అనే పాట సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పాట సోషల్ మీడియాలో 10 కోట్ల వ్యూస్ ను దాటేసి రికార్డు పుటల్లోకి ఎక్కింది. దర్శకుడు సుకుమార్ 1985 నాటి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి బాణీలను సమకూర్చాడు.

More Telugu News