సీబీఎస్ఈ టాపర్ గ్యాంగ్ రేప్ కేసు: 10 మంది నిందితుల్లో ఆర్మీ జవాను!
- హర్యానాలో కలకలం రేపిన సామూహిక అత్యాచారం
- జవాను అరెస్ట్ కు ఆర్మీ అనుమతి తీసుకున్న పోలీసులు
- నిందితుల జాడ చెబితే లక్ష రివార్డు: హర్యానా
మొత్తం ఎనిమిది నుంచి పది మంది వరకూ నిందితులుండగా, ముగ్గురి వివరాలను బాధితురాలు వెల్లడించిందని, పంకజ్ తోపాటు వారిద్దరూ కూడా పరారీలో ఉన్నారని, ఈ కేసులో వారు పట్టుబడితే, మిగతావారి వివరాలు వెల్లడవుతాయని భావిస్తున్నామని తెలిపారు. నిందితుల జాడ చెబితే రూ. లక్ష రివార్డును ఇస్తామని ప్రకటించారు.
పంకజ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల బృందం రాజస్థాన్ కు వెళ్లిందని హర్యానా పోలీస్ చీఫ్ బీఎస్ సంధు తెలిపారు. మిగతా ఇద్దరినీ మనీష్, నిషుగా గుర్తించామని చెప్పారు. వారి ఫొటోలను విడుదల చేశారు. కాగా, బుధవారం నాడు బాధితురాలు కోచింగ్ సెంటర్ కు వెళ్లి వస్తుండగా, కారులో వచ్చిన దుండగులు, ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను ఓ బస్టాండు వద్ద వదిలేసి వెళ్లిన సంగతి తెలిసిందే.