Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నితిన్ సరసన 'గీతగోవిందం' నాయిక 
  • చిరంజీవి సినిమాలో సాయిచంద్
  • బాలీవుడ్ నిర్మాణ సంస్థ చేతికి 'దేవదాస్' 

*  'గీత గోవిందం' చిత్రంతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక మందన తాజాగా నితిన్ సరసన నాయికగా నటించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా రష్మికను తీసుకున్నారట.
*  సుమారు 36 సంవత్సరాల క్రితం 'మంచుపల్లకి' చిత్రంలో నటించిన చిరంజీవి, సాయిచంద్ కలసి మళ్లీ ఇప్పుడు ఓ చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా' చిత్రంలో సాయిచంద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
*  నాగార్జున, నాని హీరోలుగా రూపొందిన 'దేవదాస్' చిత్రం ప్రదర్శన హక్కులను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ చేజిక్కించుకుంది. ఈ చిత్రం హక్కులను భారీ ఆఫర్ తో బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ 'వయాకాం 18' మోషన్ పిక్చర్స్ సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. 

More Telugu News