raghuveera reddy: 10న ‘భారత్ బంద్ ను విజయవంతం చేయాలి’: ర‌ఘువీరారెడ్డి

  • దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెంపున‌కు నిర‌స‌న‌
  • ఏఐసీసీ ఆదేశాల మేర‌కు బంద్ కు పిలుపు
  • మాతో కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో ఆందోళన చేస్తాం

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపున‌ు నిర‌సిస్తూ ఈ నెల 10న తలపెట్టిన భారత్ బంద్ ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఇక్కడ ధరలను తగ్గించకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్ చేపట్టాలని ఏఐసీసీ పిలుపు నిచ్చిందని, ప్రజల పక్షాన జరుగుతున్న ఈ ఆందోళనలో రాజకీయ‌ పార్టీలు కూడా పాల్గొనాలని కోరుతూ లేఖలు రాసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో తమతో వచ్చే అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ఈ ఆందోళనను చేపట్టాలని ఏపీసీసీ భావిస్తోందని రఘువీరా పేర్కొన్నారు.

More Telugu News