kcr: అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం.. ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి నోటిఫికేషన్

  • అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్
  • ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్న ఈసీ
  • తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి

4 సంవత్సరాల 3 నెలల 4 రోజుల పాటు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ రద్దైంది. అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ తీసుకున్న తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. దీంతో అసెంబ్లీ రద్దయినట్టు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి రాజ్ భవన్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో, ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు.

More Telugu News