Tirupati: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమారుడి మృతి... తట్టుకోలేక అక్కడే తల్లి ఉరి!

  • తిరుపతి రూయా ఆసుపత్రిలో ఘటన
  • నిన్న మరణించిన కుమారుడు
  • రాత్రి చెట్టుకు ఉరేసుకుని మరణించిన తల్లి

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన కుమారుడు మరణించడాన్ని చూసి తట్టుకోలేక పోయిన ఓ తల్లి, ఉరేసుకుని మరణించింది. ఈ ఘటన తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఓ యువకుడు దీర్ఘకాల వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందాడు.

కుమారుడి మరణ వార్త విని కుప్పకూలిన ఆ తల్లి, తనకీ బతుకు వద్దంటూ ఎంతో సేపు విలపించింది. చుట్టుపక్కల ఉన్నవారు ఆమెను ఓదార్చారు. ఆసుపత్రి సిబ్బంది, ఈ ఉదయం మృతదేహాన్ని ఆమె ఇంటికి చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి రూయా ఆసుపత్రి ప్రాంగణంలోని ఓ చెట్టుకు ఆమె ఉరేసుకుని మరణించింది. వీరిద్దరి మృతి వార్త విని బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.  

More Telugu News