kcr: మోదీని అలా అనేంత సీన్ కేసీఆర్ కు లేదు!: ధర్మపురి అరవింద్

  • ప్రగతి నివేదన సభ సక్సెస్  కాలేదు
  • అందుకు, ఆ పార్టీకి నా ప్రగాఢ సానుభూతి
  • రేపు ఎన్నికలు జరిగితే కారు బోల్తా పడటం ఖాయం

టీఆర్ఎస్ పార్టీ నిన్న నిర్వహించిన ప్రగతి నివేదన సభకు స్పందన కరువైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ స్పందిస్తూ, టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ సక్సెస్ కాలేదు కనుక, ఆ పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ సభకు హాజరైన జనం కేవలం రెండున్నర లక్షల మందేనని ఆయన చెప్పారు. రేపు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 20 సీట్ల కంటే ఎక్కువ రావని, కారు బోర్లా పడటం ఖాయమని జోస్యం చెప్పారు. ‘తెలంగాణ ప్రజలకు 95 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రధాని మోదీ ఊగిసలాడుతుంటే... తానే నేరుగా ఢిల్లీకి వెళ్లి 'చేస్తావా? చస్తావా? నరేంద్ర మోదీ చెప్పు' అని అడిగానని నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై  అరవింద్ మండిపడ్డారు. మోదీని అలా అనేంత సీన్ కేసీఆర్ కు లేదని అన్నారు. 

More Telugu News