Medak District: మెదక్ లో లారీ కంటైనర్ బీభత్సం.. తృటిలో తప్పించుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్!

షార్ట్స్‌లో చూడండి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక్కడి తుప్రాన్ టోల్ గేట్ వద్దకు వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ముందున్న రెండు కార్లను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ తృటిలో తప్పించుకున్నారు. గురువారం అర్ధరాత్రి 2 గంటలకు ఈ ఘటన జరిగింది.

మహారాష్ట్రలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన రవీందర్.. తన కుటుంబ సభ్యులతో కలసి తిరిగివస్తున్నారు. వీరంతా రెండు కార్లలో తుప్రాన్ టోల్ గేట్ వద్ద ఆగి ఉన్నారు. ఇంతలోనే వేగంగా వచ్చిన ఓ కంటైనర్ లారీ ఈ కార్లను వెనుకనుంచి బలంగా ఢీకొంది. దీంతో వెనుక కారులో ఉన్న రవీందర్ బంధువు అనిత ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా అదే కారులో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ టోల్ బూత్ ల పైకి కూడా దూసుకుపోవడంతో ఆరుగురు సిబ్బంది కూడా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదం నుంచి వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు ప్రారంభించారు.
Go Back to Shorts
Medak District
toll plaza
Road Accident
Warangal police commissioner

More Telugu News