surya: సూర్య .. సాయేషా సైగల్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు

  • దీపావళికి విడుదలవుతోన్న 'ఎన్జీకే'
  • తదుపరి సినిమా కేవీ ఆనంద్ తో 
  • ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదీన విడుదల    

ప్రస్తుతం సూర్య తాజా చిత్రంగా 'ఎన్జీకే' చిత్రం రూపొందుతోంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఆ తరువాత సినిమాను ఆయన కేవీ ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే లండన్ లో ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమా రెండవ షెడ్యూల్ వచ్చేనెల నుంచి 'పొల్లాచ్చి'లో జరగనుంది. మోహన్ లాల్ .. ఆర్య కీలకమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తమిళ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాకి, హారీస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.     

More Telugu News