Harikrishna: హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ చంద్రబాబుకు డీఎంకే అధినేత స్టాలిన్ లేఖ!

  • తెలుగుదేశం పార్టీకి తీరని లోటు
  • మరణవార్త తెలిసి షాక్ నకు గురయ్యా
  • ఎన్టీఆర్ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలన్న స్టాలిన్

హరికృష్ణ మరణవార్త తెలిసి షాక్ నకు గురయ్యానని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి లేఖ రాసిన ఆయన, ఎన్టీఆర్ ఫ్యామిలీకి తన సానుభూతిని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఓ గొప్ప నేతను కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. హరికృష్ణ మృతి దురదృష్టకరమని వ్యాఖ్యానించిన ఆయన, తనకు హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ కుటుంబానికి ఈ కష్ట సమయంలో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News