చాలా బాధగా ఉంది.. మనసును కలచి వేస్తోంది: చిరంజీవి
- హరికృష్ణ అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యా
- ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు
- హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలి
హరికృష్ణ, తాను ఎప్పుడు ఎదురుపడ్డా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, సరదాగా జోక్స్ వేస్తూ.. నవ్వించే వారని గుర్తుచేసుకున్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసభ్యులు మనో స్థైర్యంతో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, చిరంజీవితో పాటు తనయుడు హీరో రామ్ చరణ్ కూడా ఉన్నారు.