santhosh sobhan: 'పేపర్ బాయ్' రైట్స్ తీసుకోవడానికి కారకుడు బన్నీ: అల్లు అరవింద్

  • సంతోష్ శోభన్ హీరోగా 'పేపర్ బాయ్'
  • నిర్మాతగా సంపత్ నంది 
  • వచ్చేనెల 7వ తేదీన రిలీజ్    

సంపత్ నంది నిర్మాణంలో .. జయశంకర్ దర్శకత్వంలో 'పేపర్ బాయ్' సినిమా రూపొందింది. 'పేపర్ బాయ్' గా సంతోష్ శోభన్ కనిపించనున్నాడు. రియా సుమన్ .. తాన్య హోప్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు. హోల్ సేల్ గా ఈ సినిమా రైట్స్ ను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు.

తాజాగా ఈ విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, " నేను ఈ సినిమా రైట్స్ తీసుకోవడానికి కారకుడు బన్నీ. ఒక రోజున బన్నీ నాకు ఈ సినిమా ట్రైలర్ వీడియోను పంపించాడు. ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది .. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అనిపించింది. అదే సమయంలో సంపత్ నంది వచ్చి ఈ సినిమాను ఒకసారి చూడమని అడిగాడు. ట్రైలర్ నచ్చడం వల్లనే సినిమా చూశాను .. చూశాక ఈ సినిమాకి మంచి పబ్లిసిటీతో కూడిన రిలీజ్ అవసరమని అనిపించింది. అందువలన ఈ సినిమా రైట్స్ ను కొనడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.      

More Telugu News