hari krishna: నేను ఇండియాలో లేను.. వార్త వినగానే షాకయ్యా: అల్లు అర్జున్

  • హరికృష్ణ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బన్నీ
  • నందమూరి కుటుంబసభ్యులకు సంతాపం
  • హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్

మాజీ మంత్రి, సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్తను సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. హరికృష్ణ మృతి పట్ల అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. 'నేను ఇండియాలో లేను. హరికృష్ణ గారి మరణవార్తను ఇప్పుడే విన్నా. షాక్ కు గురయ్యా. నందమూరి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. సోదరులు కళ్యాణ్ రామ్, తారక్ లకు సానుభూతిని తెలుపుతున్నా. హరికృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. 

More Telugu News