Jagan: నందమూరి హరికృష్ణ మృతిపై స్పందించిన వైఎస్ జగన్!

  • వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలి
  • హరికృష్ణ కుటుంబీకులకు జగన్ సంతాపం

నందమూరి హరికృష్ణ హఠాన్మరణ వార్తను విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన జగన్, హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన తన సానుభూతిని, సంతాపాన్ని వెలిబుచ్చారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే.

More Telugu News