jayam ravi: సీక్వెల్ దిశగా 'తనీ ఒరువన్'(ధ్రువ) .. మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి

  • తమిళంలో హిట్ కొట్టిన 'తనీ ఒరువన్'
  • రీమేక్ గా వచ్చిన 'ధ్రువ' సక్సెస్
  • దర్శకుడు మోహన్ రాజా సీక్వెల్ నిర్ణయం    

తమిళంలో మోహన్ రాజా దర్శకత్వంలో 'తనీ ఒరువన్' చిత్రం తెరకెక్కింది. అరవింద్ స్వామి .. జయం రవి .. నయనతార ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 2015లో ఆగస్టు 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బలమైన కథతో .. ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేసింది.

ఇదే సినిమా 'ధ్రువ' పేరుతో చరణ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి .. చరణ్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఈ రోజుతో 'తనీ ఒరువన్' మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకి సీక్వెల్ చేయనున్నట్టుగా దర్శకుడు మోహన్ రాజా ప్రకటించారు. ఇందులోనూ జయం రవి హీరోగా చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక విలన్ గా ఎవరుచేస్తారనే విషయం తెలియాల్సి వుంది. తమిళంలో ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతూ ఉండటంతో, తెలుగులో 'ధ్రువ'కి కూడా సీక్వెల్ వచ్చే అవకాశం ఉందనే టాక్ మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.   

More Telugu News