Hyderabad: ప్రియురాలితో సహజీవనం, ఆమె స్నేహితురాలితో ప్రేమాయణం... అడ్డంగా బుక్కయ్యాడు!

  • హైదరాబాద్, బంజారాహిల్స్ లో ఘటన
  • యువతికి మాయమాటలు చెప్పి సహజీవనం
  • చూసి వెళ్లేందుకు వచ్చిన స్నేహితురాలిపైనా కన్ను
  • బాధితురాలి ఫిర్యాదుతో అరెస్ట్

ఓ యువతిని ప్రేమ పేరిట లోబరచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తున్న ఓ యువకుడు, ఆమె స్నేహితురాలితో ప్రేమాయణం సాగించి, అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రోడ్ నంబర్ 12లోని శ్రీరాంనగర్ లో ఉంటున్న ప్రేమ్ కుమార్ (26) నిరుద్యోగి. అతనికి నాలుగు నెలల క్రితం స్రవంతి అనే స్థానికురాలితో పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారితీసింది. స్రవంతిని పెళ్లి చేసుకుంటానని ప్రేమ్ కుమార్ నమ్మబలకడంతో, ఆమె సహజీవనం చేస్తోంది.

 ఇదే సమయంలో స్రవంతి స్నేహితురాలు ప్రియా చౌదరి, వారింటికి వచ్చి వెళుతుండేది. తన స్నేహితురాలి కోసం వచ్చి పోయే ప్రియపైనా ప్రేమ్ కన్ను పడింది. ఆమెకు కూడా మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. ఈ విషయం స్రవంతికి తెలియడంతో నిలదీసింది. దీంతో ఆమెపై దాడి చేసిన ప్రేమ్, తీవ్రంగా కొట్టడంతో పాటు చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రేమ్ ను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News