Pilli Padma: దారుణానికి ముందు మత్తు మందిచ్చారు... బ్యూటీషియన్ పద్మ కేసులో మరో కోణం!

  • హత్య చేయాలని పక్కా ప్లాన్ తో వచ్చిన నిందితుడు
  • హత్యాయత్నానికి ముందు అత్యాచారం కూడా
  • కలకలం సృష్టిస్తున్న పిల్లి పద్మ కేసు

బ్యూటీషియన్ పిల్లి పద్మను హత్య చేయాలని పక్కాగా పథకం వేసుకుని వచ్చిన నిందితుడు, ఆమెకు కచ్చితంగా పరిచయం ఉన్నవాడేనని పోలీసులు నిర్దారణకు వచ్చారు. హత్యాయత్నానికి ముందు ఆమెకు మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చారని, ఆమెపై అత్యాచారం కూడా జరిగిందని ఆసుపత్రి వైద్యులు తేల్చారు. కృష్ణా జిల్లా బావులపాడులో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించగా, ఆమెతో సహజీవనం చేస్తున్న నూతన్ ప్రసాద్, ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.

మత్తులో స్పృహ లేకుండా పడివున్న పద్మ కాళ్లు, చేతులూ కట్టేశాడని, మెలకువ వచ్చి అరుస్తుందేమోనన్న ఆలోచనతో, నోట్లో గుడ్డలు కుక్కాడని, ఆమె మరణించిందని భావించిన తరువాతే, నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆమెకు మత్తు మందు ఇచ్చారని వైద్యులు నిర్ధారించినా తరువాత, ఘటనా స్థలిలో మరోసారి సోదాలు జరిపిన పోలీసులు, ఆ ప్రాంతంలో ఓ సిరంజిని కనుగొన్నట్టు తెలుస్తోంది. నూతన్ ఆచూకీపై తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని, అతన్ని నేడో, రేపో అదుపులోకి తీసుకుంటామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News