KCR: కేసీఆర్ తమ ఎమ్మెల్యేలకు నగదు డబ్బాలు ఇచ్చారు: రేవంత్ రెడ్డి ఆరోపణలు

  • నిన్నటి సమావేశంలో ఈ నగదు డబ్బాలిచ్చారు
  • ఒక్కో డబ్బాలో కోటి రూపాయల చొప్పున ఉన్నాయి
  • దీనిపై మాకు పక్కా సమాచారం ఉంది

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నిన్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నగదు డబ్బాలు అందించారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ భేటీలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నగదుతో ఉన్న డబ్బాలను కేసీఆర్ ఇచ్చారని, ఒక్కో డబ్బాలో కోటి రూపాయల చొప్పున నగదు ఉందని, దీనిపై తమకు పక్కా సమాచారం ఉందని అన్నారు. ఈ విషయాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమతో చెప్పారని, దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

More Telugu News