paruchuri: 'మొక్కేకదా అని పీకేస్తే పీక కోస్తా' అనే డైలాగ్ అప్పుడు రాశాను: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ఇంద్ర' 80 శాతం షూటింగ్ అయింది
  • ఆడియో ఫంక్షన్ లో అలా జరిగింది 
  • దాంతో చిరంజీవి అలా అన్నారు  

తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో మాట్లాడుతూ, 'ఇంద్ర' సినిమా షూటింగు సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను గురించి ప్రస్తావించారు. "ఈ సినిమాకి డైలాగ్స్ రాయాలనుకుంటున్నప్పుడు 'మరీ మీరు రాసేంత ఫ్యాక్షన్ ఓరియెంటెడ్ డైలాగ్స్ ను నా బాడీ లాంగ్వేజ్ కి రాయకండి .. కొంచెం తక్కువ మోతాదులోనే వుండేలా చూడండి' అని చిరంజీవిగారు అన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ తక్కువ మోతాదులోనే రాస్తూ వెళుతున్నాం.

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు 'గురూ డైలాగ్ .. గురూ డైలాగ్' అంటూ ఒక్క డైలాగ్ చెప్పమని అక్కడ ఫ్యాన్స్ గోలచేస్తున్నారు. అప్పుడు చిరంజీవిగారు నా వైపు చూసి .. 'సాధారణంగా గురూ స్టెప్పు అని అడుగుతారు .. ఫస్టు టైమ్ వాళ్లు గురూ డైలాగ్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ మనం 80 శాతం సినిమాను తీసేశాము .. మిగతా సీన్లలో మీరు ఎలా అయితే రాయాలనుకున్నారో అలా రాయండి' అన్నారు. ఆ తరువాత రాసినదే 'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా' అనే డైలాగ్. ఇది ఏ రేంజ్ లో పేలిందో మీకు తెలిసిందే" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News