Pakistan: ఇమ్రాన్ కు మరో పరీక్ష... పాకిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి!

  • పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌ నిర్ణయం
  •  పీటీఐతో ఢీకొట్టేందుకు సన్నాహాలు
  •  ఈనెల 25న అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం

పాకిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పీటీఐకి గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. విపక్షాలకు చెందిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌)లు ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్‌ మీడియా కథనం. సెప్టెంబర్‌ 4న జరిగే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థిని ఈ నెల 25న ముర్రేలో జరిగే ప్రతిపక్ష పార్టీ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది.

  ప్రముఖ డెంటిస్ట్‌ ఆరీఫ్‌ ఆల్వీ(69)ని పీటీఐ ఇప్పటికే తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇత్‌జాజ్‌ అహసన్‌ను విపక్ష అభ్యర్థిగా పీపీపీ తొలుత ప్రకటించినప్పటికీ, పీఎంఎల్‌-ఎన్‌ అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్న షరీఫ్‌, ఆయన భార్య కుల్సుమ్‌కు వ్యతిరేకంగా అహసన్‌ వ్యాఖ్యలు చేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. అధికార, విపక్షాల మధ్య 8-10 ఓట్ల తేడా వుండడమే ఇందుకు కారణం. పరోస్ఖ పద్ధతిలో పాకిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పార్లమెంటు, నాలుగు రాష్ట్రాల (ప్రావిన్స్ లు) అసెంబ్లీ సభ్యులు పాల్గొంటారు. ప్రస్తుత అధ్యక్షుడు మమ్మూన్‌ హుస్సేన్‌ పదవీ కాలం సెప్టెంబర్‌ 9తో ముగియనుంది.






More Telugu News