kirak rp: చిరంజీవి గారు నన్ను మెచ్చుకున్నట్టుగా నాగబాబుగారు చెప్పారు: కిరాక్ ఆర్పీ

  • చిరంజీవి గారి దృష్టిలో పడ్డాను 
  • బ్రహ్మానందంగారి ఇంటికి వెళ్లాను
  • చోటాకే నాయుడు మెచ్చుకున్నారు

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కిరాక్ ఆర్పీ, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు. "ఒక రోజున నాగబాబు గారు నన్ను పిలిచారు. 'ఆ అబ్బాయి ఎవర్రా నెల్లూరు స్లాంగ్ తో చాలా బాగా చేస్తున్నాడు' అని చిరంజీవిగారు నన్ను మెచ్చుకున్నట్టుగా చెప్పారు. నాగబాబు గారు చెప్పారంటే అది నిజమే కదా .. అందుకే ఆ మాట వినగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది.

ఇక ఒక ఫంక్షన్ లో నేను చేసిన స్కిట్ ను బ్రహ్మానందం గారు చూశారు. ఆయన ఇంటికి రమ్మన్నట్టుగా నాకు ధన్ రాజ్ చెప్పాడు. దాంతో నేను బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్లాను .. అప్పుడు ఆయన తింటున్న పులిహోర నాకు పెట్టారు. ఆయన నన్ను ఇంటికి భోజనానికి ఆహ్వానించినట్టుగా ప్రచారం జరిగింది .. అందులో నిజం లేదు. ఒకసారి చోటాకే నాయుడు గారు .. 'ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన ఆర్టిస్టులలో నువ్వొకడివి' అన్నారు. అదే నాకు దక్కిన బెస్ట్ కాంప్లిమెంట్ గా నేను భావిస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చాడు.   

More Telugu News