surya: మీరా పాత్రలో ఆకట్టుకోనున్న సాయిపల్లవి

  • శర్వానంద్ తో 'పడి పడి లేచె మనసు'
  • ధనుష్ జోడీగా 'మారి 2'
  • సూర్య సరసన 'ఎన్ జి కె'    

ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో 'పడి పడి లేచె మనసు' చేస్తోంది. ఈ సినిమాలో ఆమె శర్వానంద్ జోడీగా నటిస్తోంది. తమిళంలో ధనుష్ జోడీగా 'మారి 2' .. సూర్య సరసన 'ఎన్ జి కె' సినిమా చేస్తోంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో 'మీరా' పాత్రలో సాయిపల్లవి కనిపించనుందట. 'మీరా' పాత్ర ఎంతో వైవిధ్యభరితంగా వుంటుందని అంటున్నారు.

ఈ పాత్రను దర్శకుడు సెల్వరాఘవన్ ఎంతో కొత్తగా డిజైన్ చేశాడని చెబుతున్నారు. సాయిపల్లవి నటనలో మరో కోణాన్ని ఆయన ఈ సినిమాలో చూపించనున్నాడని చెబుతున్నారు. తన కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందని సాయిపల్లవి బలంగా నమ్మడం వల్లనే ఈ సినిమా చేస్తోందని అంటున్నారు. మరో కథానాయికగా రకుల్ నటిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.     

More Telugu News