Kerala: ఇంతటి వరదలకు కారణం అయ్యప్ప స్వామి ఆగ్రహమే... దుమారం రేపుతున్న ప్రముఖుల ట్వీట్లు!

  • 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత వరద
  • జలవిలయానికి కేరళ అతలాకుతలం
  • అయ్యప్ప విషయంలో సుప్రీం జోక్యమే కారణం
  • ఆర్బీఐ బోర్డు సభ్యుడితో పాటు ఆర్ఎస్ఎస్ ప్రముఖుడి ట్వీట్

గడచిన 100 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వరదలు కేరళను చుట్టుముట్టగా, ఆ జలవిలయానికి ప్రజా జీవనం అతలాకుతలమై, పాలకులు కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం ప్రకృతి విపత్తుకూ, కేరళలోని శబరిమలలో కొలువైన దేవదేవుడు అయ్యప్ప స్వామి ఆగ్రహమే కారణమని పలువురు ప్రముఖులు ట్వీట్లు చేస్తుండటం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది.

శబరిమల వ్యవహారంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో స్వామికి కోపం వచ్చిందని ఛాందసవాదులు వ్యాఖ్యానిస్తుండగా, వారిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుడితో పాటు ఓ ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు కూడా ఉన్నారు. వీరు చేసిన వ్యాఖ్యలు సరికాదని, వరదలకు, మతపరమైన విషయాలకూ సంబంధం ఏంటని, నిరాశ్రయులైన ప్రజలకు సాయం చేయాలని నెటిజన్లు వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

More Telugu News