vijay devarakonda: 'గీత గోవిందం'లో ప్రత్యేక ఆకర్షణగా మెరిసిన అనూ .. నిత్యామీనన్

  • ఈ నెల 15వ తేదీన వచ్చిన 'గీత గోవిందం'
  • 3 రోజుల్లోనే లాభాల బాటలో 
  • థ్రిల్ ఫీల్ అవుతోన్న ఆడియన్స్  

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేసిన 'గీత గోవిందం' .. ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమాకి యూత్ నీరాజనాలు పడుతోంది. మొదటి 3 రోజుల్లోనే లాభాల బాటపట్టిన ఈ సినిమాకి నిత్యామీనన్ .. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో నిత్యామీనన్ .. అనూ ఇమ్మాన్యుయేల్ అతిథి పాత్రల్లో మెరవనున్నారనే విషయం బయటికి రాకుండా గోప్యంగా ఉంచారు.తెరపై వీళ్లిద్దరిని చూడగానే అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో తన కథను నిత్యామీనన్ తోనే హీరో చెప్పుకుంటాడు. మూడు సందర్భాల్లో ఆమె ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక అనూ ఇమ్మాన్యుయేల్ ను హీరో ముగ్గులోకి దింపే ప్రయత్నం చేస్తాడు.. ఆ సన్నివేశంలో మాత్రమే ఆమె కనిపిస్తుంది. నిత్యామీనన్ కి సంబంధించిన సీన్స్ ను 12 గంటల్లోను .. అనూ ఇమ్మాన్యుయేల్ సీన్ ను 3 గంటల్లోను చిత్రీకరించారట.   

More Telugu News