vaj payee: కొనసాగుతున్న వాజ్ పేయి అంతిమయాత్ర.. కాలినడకన అనుసరిస్తున్న మోదీ!

  • అంతిమయాత్ర వాహనం వెంటే నడుస్తున్న మోదీ, 
  • అమిత్ షా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలు కూడా 
  • సుమారు గంటన్నరకు పైగా నడిచిన నేతలు

మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ప్రారంభమైంది. ఈ అంతిమయాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వాజ్ పేయి భౌతికకాయం ఉంచిన వాహనం వెంటే మోదీ నడుస్తూ వెళుతున్నారు. మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నడుస్తూ వెళుతున్నారు.

దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రీయ స్మృతి స్థల్ మధ్య దూరం సుమారు నాలుగు కిలోమీటర్లు. వాజ్ పేయి భౌతిక కాయం ఊరేగింపు కార్యక్రమంలో సుమారు గంటన్నరకు పైబడి మోదీ సహా అగ్రనేతలు నడుస్తుండటం గమనార్హం. కాగా, వాజ్ పేయి మృతితో తండ్రిని కోల్పోయినంత బాధగా ఉందని మోదీ, ఓ ధృవతార రాలిపోయిందని అమిత్ షాలు తమ విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

More Telugu News