vajpayee: వాజ్ పేయి నివాసానికి చేరిన పార్ధివదేహం

  • ‘ఎయిమ్స్’ నుంచి నివాసానికి భౌతికకాయం తరలింపు
  • నివాసం వద్దకు చేరుకున్న బీజేపీ అగ్రనేతలు 
  • రేపు సాయంత్రం 5 గంటలకు అంతిమ సంస్కారాలు

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి వాజ్ పేయి నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. బీజేపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ప్రజల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయానికి ఆయన మృతదేహాన్ని రేపు ఉదయం తొమ్మిది గంటలకు తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు అంతిమయాత్ర, సాయంత్రం 5 గంటలకు విజయ్ ఘాట్ లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.  

More Telugu News