vijay devarakonda: 'గీత గోవిందం' టీమ్ ను అభినందించిన చిరూ

  • పరశురామ్ టేకింగ్ ఆకట్టుకుంది  
  • విజయ్ చాలా బాగా చేశాడు 
  • తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుంది  

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మాతగా .. పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం' చిత్రం తెరకెక్కింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి కోసం ఈ సినిమా స్పెషల్ షోను వేశారు. స్పెషల్ షో చూసిన చిరంజీవి ఈ సినిమా టీమ్ ను ప్రశంసించారు. దర్శకుడిగా పరశురామ్ కథాకథనాలను నడిపించిన తీరును .. విజయ్ దేవరకొండ నటనను ఆయన అభినందించారు. రష్మిక మందన కూడా తన పరిధిలో చాలా చక్కగా నటించిందనీ .. సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అన్నారు. యూత్ కోరుకుంటోన్న కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్ తో ఈ సినిమా టీమ్ లో ఉత్సాహం పెరిగింది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా .. వీకెండ్ లో తన జోరును ఏ స్థాయిలో పెంచుతుందో చూడాలి.      

More Telugu News