Mehrin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సుధీర్ బాబుతో జతకట్టనున్న మెహ్రీన్ 
  • ఏఎల్ విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ 
  • మలయాళ చిత్రంలో 'గూఢచారి' నాయిక  

*  సుధీర్ బాబు సరసన మెహ్రీన్ కథానాయికగా నటించనుంది. నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారు. ఈ చిత్రం షూటింగ్ రేపు ప్రారంభమవుతుంది. తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.    
*  రాంచరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న సంగతి విదితమే. ఇందుకు గాను ఆయనకు 4 కోట్ల భారీ పారితోషికాన్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఓ బాలీవుడ్ నటుడుకి ఈ స్థాయిలో తెలుగు సినిమాకి పారితోషికం ఇవ్వడం విశేషమే!  
*  'గూఢచారి' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక శోభిత ధూళిపాళ మలయాళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. యంగ్ హీరో నివిన్ పౌలీ సరసన 'మూతోన్' అనే సినిమాలో శోభిత నటించనుంది. 

More Telugu News