madhu sudhana chary: బైక్ ప్రమాదంలో తెలంగాణ స్పీకర్ కు స్వల్పగాయాలు

  • వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో ఘటన
  • ‘పల్లెనిద్ర’లో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం
  • వెంటనే అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ సిబ్బంది

తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి బైక్ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈరోజు ఉదయం బైక్ పై ర్యాలీగా తిరుగు ప్రయాణమైన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పింది. దీంతో, మధుసూదనాచారి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ సిబ్బంది మధుసూదనాచారిని పైకి లేపారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతరం, మధుసూదనాచారి తన ర్యాలీని కొనసాగించడం కొసమెరుపు.

More Telugu News