Rahul Gandhi: గన్ పార్క్ లో నివాళులర్పించిన రాహుల్ గాంధీ

  • తెలంగాణ అమరవీరులకు రాహుల్ నివాళి
  • భారీ సంఖ్యలో చేరుకున్న ‘కాంగ్రెస్’ శ్రేణులు
  • సరూర్ నగర్ సభలో పాల్గొననున్న రాహుల్

హైదరాబాద్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

అనంతరం, సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రజా చైతన్య బస్సులో బయలుదేరి వెళ్లారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆ బస్సు ఎక్కారు. కాగా, కాంగ్రెస్ శ్రేణులు గన్ పార్క్ వద్దకు భారీగా చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. 

More Telugu News