charan: తాజా షెడ్యూల్ కి రెడీ అవుతోన్న చరణ్

  • బోయపాటితో సెట్స్ పై చరణ్ 
  • కథానాయికగా కైరా అద్వాని 
  • త్వరలోనే ఫస్టులుక్ వదిలే ఛాన్స్

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకు చిత్రీకరణను జరుపుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను రేపటి నుంచి హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కావడం వలన, ఈ లోగా టైటిల్ ను ఖరారు చేసుకుని ఆ రోజున ఫస్టులుక్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చరణ్ కి మాస్ హీరోగా మంచి క్రేజ్ వుంది .. ఇక బోయపాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమా పట్ల అందరిలోనూ ఆసక్తి వుంది.  

More Telugu News