Pakistan: పాకిస్థాన్ నటి రేష్మను కాల్చిచంపిన భర్త!

  • ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతంలో ఘటన
  • నిందితుడికి నాలుగో భార్య రేష్మ
  • ఈ సంవత్సరం 15 మంది మహిళా కళాకారుల హత్యలు

పాకిస్థాన్ లో ప్రముఖ నటి, గాయకురాలు రేష్మ దారుణ హత్యకు గురికాగా, ఆమె భర్తే తుపాకితో కాల్చి చంపినట్టు అనుమానిస్తున్నారు. ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి నౌషేరా కలాన్ ప్రాంతంలోని హకిమాబాద్ ప్రాంతంలో తన సోదరుడితో ఆమె ఉంటుండగా, ఇంట్లోకి దూసుకొచ్చిన ఓ వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపి పారిపోయాడని 'జియో టీవీ' పేర్కొంది.

నిందితుడు ఆమె భర్తేనని, ఆయనకు రేష్మ నాలుగో భార్యని వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రేష్మ భర్తను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంచితే, ఈ సంవత్సరంలో పాకిస్థాన్ లో మహిళా కళాకారులను దారుణంగా హత్య చేసిన ఘటనల్లో ఇది 15వది. గాయనిగా మాత్రమే కాకుండా, పాకిస్థాన్ లో ఫేమస్ అయిన 'జోబల్ గోలునా'  డ్రామాలో నటించి, రేష్మ తన అభిమానులను మెప్పించింది.

More Telugu News