ఇకపై డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో సాయుధులైన పోలీసులు కూడా!
- పోలీసులతో వాగ్వాదం, మీడియాపై దాడులకు దిగుతున్న మందుబాబులు
- శుక్ర, శనివారాల్లో సాయుధ బలగాల సాయం
- వెల్లడించిన సైబరాబాద్ సీపీ సజ్జన్నార్
మందుబాబులను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పిన ఆయన, ఐటీ కారిడార్, నగర శివారు ప్రాంతాల్లో రిసార్ట్ లు, మద్యం దుకాణాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయని అన్నారు. వీటిల్లో మద్యం తాగి రోడ్డెక్కుతున్న వాహనదారులు రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి - జూన్ మధ్య 7,791 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రూ. 84,36,550 జరిమానా వసూలు చేశామని, 1379 మందిని జైలుకు పంపించామని ఆయన తెలిపారు.