Dsrinivas: డీఎస్‌ కుమారుడికి హైకోర్టులో చుక్కెదురు!

  • లైంగిక వేధింపుల కేసు లో డిఎస్ కుమారుడికి చుక్కెదురు 
  • సంజయ్ వేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టివేసిన హైకోర్టు 
  • కేసు విచారణ ప్రక్రియపై స్టే కూడా నిరాకరించిన కోర్టు 

నర్సింగ్ కాలేజీ విద్యార్థినులను లైంగిక  వేధింపులకు గురి చేశారని నమోదైన కేసులో రాజ్యసభ సభ్యుడు డీఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలని కోరుతూ సంజయ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు  కొట్టి వేసింది.

వ్యక్తిగత కక్షలతో, రాజకీయ కారణాలతో తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తాను ఏ తప్పు చేయలేదని సంజయ్ క్వాష్ పిటీషన్ లో పేర్కొన్నారు. కేసు విచారణ ప్రక్రియపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థననూ తిరస్కరించింది. శాంకరీ విద్యా సంస్థల నిర్వాహకుడు సంజయ్ నర్సింగ్ కళాశాలల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారని సంబంధిత విద్యార్థినులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సంజయ్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.  

More Telugu News