karunanidhi: రాజాజీ హాల్ నుంచి కరుణ పార్థివ దేహం తరలింపు.. ఊరేగింపుగా మెరీనా బీచ్ కు!

  • మొదలైన కరుణానిధి అంతిమయాత్ర
  • వాలాజా రోడ్, చేపాక్ స్టేడియంల మీదుగా మెరీనాకు
  • కంటతడి పెడుతున్న అభిమానులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన పార్థివదేహాన్ని త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది తమ భూజాలపై మోస్తూ... అంతిమయాత్ర వాహనంలోకి చేర్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వేలాది మంది హృదయాలు బరువెక్కాయి. అక్కడున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు. అశేష జనవాహిని కరుణ పార్థివ దేహం వెంట నడుస్తూ మెరీనా బీచ్ వైపు కదిలారు. ఈ అంతిమయాత్ర రాజాజీ హాల్ నుంచి వాలాజా రోడ్, చేపాక్ స్టేడియంల మీదుగా మెరీనాకు చేరుకుంటుంది. 5 గంటలకు మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయి.

More Telugu News