Kamal Haasan: వాయిదా పడిన 'విశ్వరూపం-2' విడుదల... అడ్వాన్స్ టికెట్లు కొన్నవారికి డబ్బు వాపస్!

  • రేపు విడుదల కావాల్సి వున్న 'విశ్వరూపం-2'
  • కరుణ మరణంతో రెండు రోజుల పాటు థియేటర్ల బంద్
  • అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్న కమల్

దక్షిణాది విలక్షణ నటుడు కమలహాసన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'విశ్వరూపం-2' విడుదలను వాయిదా వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం 10వ తేదీన విడుదల కావాల్సివుంది. అయితే, తమిళనాటు మాజీ సీఎం కరుణానిధి మరణించడం, రెండు రోజుల పాటు సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుండటంతో, తమిళనాడులో సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించే వీల్లేకుండా పోయింది.

అందువల్ల ఈ సినిమా విడుదలను ఆగస్టు 15కు వాయిదా వేయాలని కమల్ భావిస్తున్నట్టు చిత్ర టీమ్ వెల్లడించింది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుండగా, ప్రకటన వెలువడిన తరువాత అడ్వాన్స్ టికెట్లను బుక్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బులు వెనక్కు ఇస్తామని తెలిపింది.

More Telugu News