venkatesh: 'శ్రీనివాస కళ్యాణం' కోసం వాయిస్ ఓవర్ చెప్పిన వెంకటేశ్

  • దిల్ రాజు నిర్మాతగా 'శ్రీనివాస కళ్యాణం'
  • నితిన్ సరసన రాశి ఖన్నా 
  • ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు

దిల్ రాజు నిర్మాతగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' రూపొందింది. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కొన్ని పాత్రలను పరిచయం చేసే సందర్భాల్లోనూ .. కీలకమైన సన్నివేశాలను లింక్ చేసే సందర్భాల్లోను వాయిస్ ఓవర్ వుంటుందట. ఆ వాయిస్ ఓవర్ వెంకటేశ్ తో చెప్పిస్తే మరింత బాగా కనెక్ట్ అవుతుందని భావించి ఆయనను సంప్రదించారు.

 అందుకు అంగీకరించిన వెంకటేశ్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాలో అక్కడక్కడా వచ్చే ఆయన వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. గతంలో 'శ్రీనివాస కళ్యాణం' అనే టైటిల్ తో వెంకటేశ్ ఒక సినిమా చేశారనే సంగతి తెలిసందే. విజయవంతమైన ఆ సినిమా వెంకటేశ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. అదే పేరుతో ఇప్పుడు వస్తోన్న సినిమాకి వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.   

More Telugu News