Malayalam: మరో మలుపు తిరిగిన నటి భావన కేసు... హైకోర్టును ఆశ్రయించిన ఇద్దరు హీరోయిన్లు!

  • మహిళా న్యాయమూర్తి కావాలంటూ పిటిషన్
  • సీబీఐకి కేసును అప్పగించాలన్న నటుడు దిలీప్
  • రెండు పిటిషన్లనూ విచారణకు స్వీకరించిన హైకోర్టు

దక్షిణాది హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్) సభ్యులుగా ఉన్న హీరోయిన్లు హనీ రోజ్, రచనా నారాయణ కుట్టీలు కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తూ, ఈ కేసులో వాదనలు వినేందుకు మహిళా న్యాయమూర్తినే నియమించాలని కోరారు. ఇదే సమయంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ సైతం ఓ పిటిషన్ ను దాఖలు చేయడంతో, రెండు పిటిషన్లనూ కోర్టు విచారణకు స్వీకరించింది.

మాలీవుడ్ లో కలకలం రేపిన భావన వేధింపుల కేసులో మహిళా న్యాయమూర్తిని నియమిస్తామన్న కేరళ సర్కారు, ఇంతవరకూ ఆ పని చేయలేదు. ఇటీవలే దిలీప్ పై విధించిన నిషేధాన్ని సైతం 'అమ్మ' తొలగించింది. ఈ నేపథ్యంలో మహిళా జడ్జి అయితేనే విచారణ పారదర్శకంగా సాగి, సత్వర న్యాయం జరుగుతుందని హనీ రోజ్, రచనలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.

More Telugu News