Jagan: జగన్ ను నమ్మితే నోట్లో మట్టేనని ప్రజలు గుర్తించారు: బుద్ధా వెంకన్న

  • వైఎస్ కుటుంబం కడప, పులివెందులకు ఏం చేయలేదు
  • కన్నా తన ఆస్తులను కాపాడుకునే పనిలో ఉన్నారు
  • అందుకే, బీజేపీలో చేరారు

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు చంద్రబాబును నమ్మితే ఎటువంటి సమస్యలు ఉండవని, అదే, జగన్ ని నమ్మితే నోట్లో మట్టేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని అన్నారు. వైఎస్ కుటుంబం కడప, పులివెందులకు చేసిందేమీలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా ఆరోపణలు చేశారు. కన్నా తన ఆస్తులను కాపాడుకునే పనిలో ఉన్నారని, అందుకే, బీజేపీలో చేరారని అన్నారు.

More Telugu News