imran khan: భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటా: కపిల్ దేవ్

  • మాజీ క్రికెటర్లకు ఇమ్రాన్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి 
  • ఇన్విటేషన్ వస్తే ముందుగా ప్రభుత్వంతో చర్చిస్తానన్న కపిల్ 
  • తాను వెళుతున్నట్టు సిద్ధూ ఇప్పటికే ప్రకటన 

పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ చేయనున్న ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే విషయంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆచితూచి మాట్లాడాడు. తనకు ఇమ్రాన్ నుంచి ఆహ్వానం వస్తే కనుక ముందుగా భారత ప్రభుత్వంతో చర్చిస్తానని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఈ నెల 11న పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సిద్ధూలకు ఆహ్వానాలు వెళ్లాయి. పాకిస్థాన్ కు వెళ్తున్నానని సిద్ధూ ఇప్పటికే ప్రకటించగా... గవాస్కర్ ఇంకా స్పందించలేదు.

More Telugu News